ఏపీలో 161కి పెరిగిన కరోనా వైరస్ కేసులు

ఏపీలో 161కి పెరిగిన కరోనా వైరస్ కేసులు

ఏపీలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత రాత్రి 10 గంటల తరువాత నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు వచ్చిన ఫలితాలలో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 161 కి పెరిగిందని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నెల్లూరులో 32 కేసులు నమోదు కాగా ఆ తరువాత 23కేసులు కృష్ణా జిల్లాలో, 20 కేసులు గుంటూరు జిల్లాలో నమోదు అయ్యాయి. కడపలో 19 , ప్రకాశంలో 17 , పశ్చిమ గోదావరిలో 15 , విశాఖలో 14 , తూర్పు గోదావరి 9 , చిత్తూరు 9 ,అనంతపురం 2, కర్నూల్ 1 కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story