ప్రముఖ క్రీడాకారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
దేశంలో రోజు రోజుకు కరోనా తీవ్రత పెరిగిపోతున్న తరుణంలో ప్రధాని మోడీ వరసగా ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూన్నారు. గురువారం ప్రధాని మోడీ దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్ డౌన్ విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలనీ సూచించారు. కాగా, శుక్రవారం ఉదయం 9 గంటలకు వీడియో సందేశం ఇచ్చిన మోడీ, ఇప్పుడు దేశంలోని ప్రముఖ క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
దేశంలోని 40 మంది ప్రముఖ క్రీడాకారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా క్రీడాకారులను మోదీ కోరారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత, వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రజలను చైతన్య పరచాలని ప్రధాని క్రీడాకారులను కోరారు. దేశంలో ప్రస్తుత పరిస్థితిని వివరించడంతోపాటు లాక్డౌన్ నియమ నిబంధనలు ప్రతిఒక్కరు పాటించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, సౌరభ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు, హిమదాస్ తదితరులు పాల్గొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com