క్వారంటైన్లో నానీ హీరోయిన్
By - TV5 Telugu |3 April 2020 1:40 PM GMT
సినిమా షూటింగుల నిమిత్తం మార్చి 12-15 తేదీల మద్య కాలంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సిటీలకు ప్రయాణం చేసిన కన్నడ భామ శ్రద్ధా శ్రీనాద్ 14 రోజులు క్వారంటైన్లో ఉంది. ఆమె ప్రయాణించిన ప్లైట్లోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రయాణీకులందరూ స్వీయనిర్భందంలోకి వెళ్లారు. తన ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు తానూ క్వారంటైన్లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది శ్రద్దా. టాలీవుడ్ హీరో నానీతో పాటు జెర్సీలో నటించి మంచి మార్కులు కొట్టేసిన శ్ర్రద్ధకు ఆ తరువాత మరిన్ని చిత్రాల్లో ఆఫర్లు తలుపు తట్టాయి. మార్చి 29 నాటికి 14 రోజులు పూర్తవడంతో ఇప్పుడు లాక్డౌన్ కారణంగా షూటింగులు లేనందున వంటగదిలో అమ్మకు సాయం చేస్తున్నానని శ్రద్ధా ట్వీట్ చేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com