రాష్ట్రాలకు కేంద్రం 11 వేల కోట్ల నిధులు
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు గాను కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆసరాగా నిలిచింది. రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎంఎఫ్) కింద అత్యవసర విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. దాంతో ఎస్డీఆర్ఎంఎఫ్ కింద వివిధ రాష్ట్రాలకు గాను 11,092 కోట్లు విడుదల చేసేందుకు మార్గం సుగమం అయినట్లయింది. కాగా ఎస్డీఆర్ఎంఎఫ్కు తొలి విడత కింద ఈ నిధులు విడుదల చేయనున్నట్టు
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మార్చి 28 న, ఈ ప్రయోజనం కోసం ఎస్డిఆర్ఎఫ్ను ఉపయోగించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించింది. ఇక ఈ నిధులను దేశవ్యాప్తంగా లాక్డౌన్ చర్యల కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులతో సహా నిరాశ్రయులకు ఆహారం మరియు ఆశ్రయం కల్పించాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుచేస్తోంది. కాగా ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఆ తరువాత ఈ నిధులు విడుదల చేసింది కేంద్రం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com