రాష్ట్రాలకు కేంద్రం 11 వేల కోట్ల నిధులు

రాష్ట్రాలకు కేంద్రం 11 వేల కోట్ల నిధులు

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు గాను కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆసరాగా నిలిచింది. రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (ఎస్డీఆర్‌ఎంఎఫ్‌) కింద అత్యవసర విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆమోదం తెలిపారు. దాంతో ఎస్డీఆర్‌ఎంఎఫ్‌ కింద వివిధ రాష్ట్రాలకు గాను 11,092 కోట్లు విడుదల చేసేందుకు మార్గం సుగమం అయినట్లయింది. కాగా ఎస్‌డీఆర్‌ఎంఎఫ్‌కు తొలి విడత కింద ఈ నిధులు విడుదల చేయనున్నట్టు

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మార్చి 28 న, ఈ ప్రయోజనం కోసం ఎస్‌డిఆర్‌ఎఫ్‌ను ఉపయోగించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించింది. ఇక ఈ నిధులను దేశవ్యాప్తంగా లాక్డౌన్ చర్యల కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులతో సహా నిరాశ్రయులకు ఆహారం మరియు ఆశ్రయం కల్పించాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుచేస్తోంది. కాగా ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.. ఆ తరువాత ఈ నిధులు విడుదల చేసింది కేంద్రం.

Tags

Read MoreRead Less
Next Story