భయాందోళనకు గురవుతున్న చెన్నై తంబీలు.. ఒక్కరోజులో 102 కేసులు
By - TV5 Telugu |3 April 2020 8:01 PM GMT
తమిళనాడులో గత మూడు రోజుల నుంచి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. నిన్న శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ విజయభాస్కర్ మీడియాకు వెల్లడించారు. ఇప్పటి వరకు 3,684 కరోనా అనుమానితుల్ని గుర్తించి శాంపిల్స్ పంపించగా అందులో 411 మందకి పాజిటివ్ అని తేలిందని ఆయన అన్నారు. మంగళవారం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా, బుధవారం నాటికి మళ్లీ కొత్త కేసులు 110, గురువారం 75 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆందోళనకు గురవుతోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com