భారత్ లో క్రమంగా పెరుగుతోన్న వైరస్ కేసులు

భారత్ లో క్రమంగా పెరుగుతోన్న వైరస్ కేసులు

భారత్ లో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా పెరుగుతూ ఉంది. శనివారం ఒకేరోజు 600 పైగా కేసులు నమోదయ్యాయి. దాంతో ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 3,100 కు చేరుకుంది. ఇక మరణాల సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగింది. శనివారానికి మొత్తం మరణాల సంఖ్య 75 కు చేరుకుంది. అలాగే కోలుకున్న వారి సంఖ్య కూడా పెరిగింది..

శనివారం నాటికి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 212 గా ఉందని కేంద్ర ప్రభుత్వం తన అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది. ఇక మరణాలు, డిశ్చార్జ్ కేసులు పోను ఇప్పుడు మొత్తం 2784 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక వివిధ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య కూడా పెరిగింది. ఇక అత్యధికంగా మహారాష్ట్రలో 490 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా ఆ తరువాత ఢిల్లీలో 445 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత తమిళనాడు 411 కేసులతో మూసి స్థానంలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story