కరోనా కాటేసింది.. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి..

కరోనా కాటేసింది.. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి..

ఫ్లోరిడాకు చెందిన ఓ జంటకు కరోనా సోకి 6 నిమిషాల వ్యవధిలో ఇద్దరూ మరణించారు. స్టువర్ట్ బేకర్ (74), అడ్రియన్ బేకర్ (72). వీరికి వివాహం జరిగి 51 ఏళ్లయింది. అన్యోన్యమైన జంటగా బంధువుల్లో గుర్తింపు పొందారు. గత మార్చి నెలలో స్టువర్ట్‌కి జ్వరం వచ్చింది. దాంతో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు కొడుకు బడ్డీ. ఎందుకైనా మంచిదని డాక్టర్లు కరోనా టెస్ట్‌లు కూడా చేశారు. ఇంటికి వెళ్లిన స్టువర్ట్ హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. కరోనా పాజిటివ్ అని తేలిందని. దాంతో అతన్ని గృహ నిర్భంధంలో ఉంచారు.

అయితే తల్లి అడ్రియన్‌కి ఎటువంటి అనారోగ్యం లేకపోయినా ఆమెను పరీక్షించమని వైద్యులకు తెలిపాడు బడ్డీ. ఆమెకు ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని అన్నారు. ఈ సమయంలో భార్యా భర్తలు ఇద్దరూ ఒకే చోట ఉండడం అవసరమని ఇద్దరినీ ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేటర్‌పై ఉంచారు. రోజు రోజుకి పరిస్థితి దిగజారడంతో వెంటిలేటర్ తీసేశారు వైద్యులు. దాంతో భార్యా భర్తలిద్దరూ 6 నిమిషాల వ్యవధిలో కన్నుమూశారు.

కొడుకు బడ్డీ ఈ విషయన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ అమ్మా, నాన్న ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచి వేసిందని, ప్రజలు ఈ మహమ్మారిని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని, తరచూ చేతులు శుభ్రపరచుకోవాలని, ఇంట్లోనే ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story