కరోనా భయం.. మూడో ఫ్లోర్ మీద నుంచి దూకి..

కరోనా భయం.. మూడో ఫ్లోర్ మీద నుంచి దూకి..

కరోనా వచ్చి కొందరు పోతుంటే అనుమానంతో ఆత్మహత్యలు చేసుకునే వారు మరికొందరు. ఢిల్లీలోని ఎయిమ్ప్ జయప్రకాశ్ నారాయణ్ అపెక్స్ ట్రామా సెంటర్‌లో చికిత్స్ తీసుకుంటున్న వ్యక్తి తనకు కరోనా వచ్చిందేమో అన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడడ్డాడు. ఎయిమ్స్ బిల్డింగ్‌లోని మూడో అంతస్తు పై నుంచి దూకాడు. చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పనైంది. అదృష్టవశాత్తు కాలు మాత్రమే విరిగి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉందని, అయితే అతడికి చేసిన కరోనా టెస్ట్ రిపోర్టులు ఇంకా రాలేదని వైద్యులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story