పీఎంకేర్స్కు గవర్నర్ తమిళిసై విరాళం
By - TV5 Telugu |6 April 2020 3:58 PM GMT
పీఎం కేర్స్ నిధికి తెలంగాణ గవర్నర్ తమిళిసై విరాళం అందించారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా పీఎంకేర్స్ నిధికి ఆమె రూ.5 లక్షల చెక్కు పంపించారు. అలాగే కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా గవర్నర్ తమిళిసై ఒక నెల వేతనాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com