తమిళనాడులో ఒక్కరోజే 50 కరోనా కేసులు

X
By - TV5 Telugu |7 April 2020 2:38 AM IST
దేశంలో రోజు రోజుకి కరోనా విజృంభిస్తోంది. పలు ప్రాంతాలలో కరోనా వేగం గుబులు పుట్టిస్తుంది. తమిళనాడులో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. తమిళనాడులో సోమవారం ఒక్కరోజే ఇక్కడ కొత్తగా 50 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే.. ఇందులో 48 మంది తబ్లిగి జమాత్కు వెళ్లివచ్చిన వారని తమిళనాడు ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 621కి చేరింది. ఇందులో 570 మంది కరోనా బాధితులు తబ్లిగి జమాత్ కార్యకర్తలేనని తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేశ్ వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com