అగ్రరాజ్యంలో కరోనా కలకలం.. 24 గంటల్లో 1845 మంది మృతి
By - TV5 Telugu |8 April 2020 11:20 AM GMT
కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం గజగజ వణికిపోతోంది. ఈ మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ మరింత వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఐరోపా దేశాలతో పాటు అమెరికాలో కొవిడ్ మృత్యు మృదంగాన్ని మోగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో 24 గంటల్లో 1,845 మంది మృతి చెందారు. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో భారతీయ అమెరికన్లకు వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్లో గడిచిన 24 గంటల్లో 731 మంది మృతి చెందినట్లు గవర్నర్ ఆండ్య్రూ కుమో వెల్లడించారు. దీంతో న్యూయార్క్ సిటీలో మరణాల సంఖ్య 5,489కి చేరింది.
యూఎస్ఏలో ఇప్పటి వరకు 4,00,335 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com