తృప్తినిచ్చే ఓ చిన్న సాయం.. మాస్కుల తయారీలో మంత్రి భార్య,కూతురు
మనం చేసే ఓ చిన్న సాయం వారికి కొంచెమైనా అక్కరకొస్తుందంటే అంతకు మించి తృప్తి ఉండదు. కరోనా బాధితులకు అండగా ప్రతి ఒక్కరు పెద్ద మనసుతో సాయం చేస్తున్నారు. పీఎం, సీఎం ఫండ్లకు విరివిగా విరాళాలు అందిస్తున్నారు. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు కరోనా నియంత్రణ చర్యల్లో భాగస్వామ్యులవుతున్నారు. కొందరు నేరుగా కనీస వస్తు సామాగ్రిని, మాస్కులను అందిస్తున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ భార్య మృదుల, కుమార్తె నైమిషా మాస్కులను తయారు చేస్తున్నారు. అవసరమైన వారికి అందిస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యలో తన భార్యా, బిడ్డ భాగస్వాములవడం తనకెంతో తృప్తినిచ్చిందని చెబుతూ.. మాస్కులు కుడుతున్న వారిద్దరి ఫోటోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రతి ఒక్కరూ మాస్కును ధరించాలని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com