తమిళనాడులో మరో 48 మందికి కరోనా పాజిటివ్
TV5 Telugu8 April 2020 11:18 PM GMT
ఢిల్లీలోని తబ్లిఘి జమాత్ మీట్ నుండి తిరిగి వచ్చిన 42 మందితో సహా మరో ముగ్గురు తమిళనాడు వాసులకు కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది. దీంతో తమిళనాడులో బుధవారం నాటికి కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 738 గా ఉందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,194కు చేరింది. అటు.. 402 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ప్రభత్వం వెల్లడించింది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 149 మంది మరణించారని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు.
Next Story