నిలకడగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నిలకడగా ఉంది. గత 12 గంటల్లో రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 217 సాంపిల్స్ ను పరీక్షించగా, అన్ని కేసులు నెగటివ్ గా నిర్దారించబడ్డాయని ఏపీ ప్రభుత్వం అధికారిక హెల్త్ ట్విట్టర్ ఖాతా వెల్లడించింది.
బుధవారం ఉదయం 9 నుంచి జరిగిన పరీక్షల్లో కొత్తగా గుంటూరు లో 8, అనంతపూర్ లో 7, ప్రకాశం 3, పశ్చిమ గోదావరి లో ఒక్క కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 19 కేసులతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 348 కి పెరిగింది. జిల్లాల వారీగా చూసుకుంటే.. విశాఖపట్నం 20, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి 22, కృష్ణా 35, గుంటూరు 49, ప్రకాశం 27, నెల్లూరు 48, కడప 28, కర్నూల్ 75, చిత్తూరు 20, అనంతపురం 13 గా నమోదయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com