భారత్ లో పాజిటివ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరిగింది..
By - TV5 Telugu |11 April 2020 4:06 PM GMT
భారత్ లో కరోనా వైరస్ కేసులు అతకంతకూ పెనుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య 7 వేల 785 కు చేరుకుంది. నేడు మహారాష్ట్రలో 92, గుజరాత్లో 54, రాజస్థాన్లో 18, ఉత్తర ప్రదేశ్ 3, హిమాచల్ ప్రదేశ్3, జార్ఖండ్లో 3 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు covid19india.org వెబ్సైట్ ఈ గణాంకాలను వెల్లడించింది.. రాష్ట్ర ప్రభుత్వాల డేటా ప్రకారం ఈ సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. కాగా ఈ వ్యాధితో 239 మంది మరణించారు.. 643 మందికి నయమైంది.. దీంతో 6 వేల 565 మంది ప్రస్తుతం దేశంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com