ఏపీలో రోజురోజుకూ విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి.. జిల్లాల వారీగా చూస్తే..

ఏపీలో  రోజురోజుకూ విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి.. జిల్లాల వారీగా చూస్తే..

ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు 381 కి చేరుకున్నాయి. రాష్ట్రంలో నిన్న ఉదయం 9 నుంచి 7 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరు లో 7, తూర్పు గోదావరి లో 5, కర్నూల్ లో 2, ప్రకాశం లో 2 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే విశాఖపట్నం 20, తూర్పు గోదావరి 17, పశ్చిమ గోదావరి 22, కృష్ణా 35, గుంటూరు 58, ప్రకాశం 40, నెల్లూరు 48, కడప 29, కర్నూల్ 77, చిత్తూరు 20, అనంతపురం 15 గా నమోదయ్యాయి. అటు కరోనాపై రివ్యూ చేసిన సీఎం జగన్.. నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Tags

Read MoreRead Less
Next Story