ఒడిశా బాటలో మరో రాష్ట్రం.. లాక్డౌన్ను పొడిగిస్తూ ఉత్తర్వులు
By - TV5 Telugu |10 April 2020 8:14 PM GMT
ఒడిశా బాటలోనే పలు రాష్ట్రాలు నడుస్తున్నాయి. మే 1వరకూ లాక్డౌన్ను పొడిగిస్తూ పంజాబ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే మే 1వరకూ లాక్డౌన్ అమలు చేయక తప్పదని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు భయాన్ని కలిగిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమరీందర్ సింగ్ చెప్పారు.
ఇప్పటికే లాక్డౌన్ పొడిగిస్తూ.. ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నవీన్ పట్నాయక్ బాటలో పలువురు సీఎంలు నడిచే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 30 వరకూ లాక్డౌన్ను పొడిగించాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com