అన్నిరాష్ట్రాలు లాక్డౌన్ పొడిగించాలంటే.. ఆ రాష్ట్ర సీఎం మాత్రం..

అన్నిరాష్ట్రాలు లాక్డౌన్ పొడిగించాలంటే.. ఆ రాష్ట్ర సీఎం మాత్రం..

కరోనాని కట్టడి చేయాలంటే లాక్డౌన్ తప్పించి మార్గం కనిపించడం లేదని దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశాయి. ముఖ్యమంత్రుల నిర్ణయంతో ప్రధాని మోదీ కూడా ఏకీభవించారు. తరువాతి జీవనం సాగించాలంటే ముందు మనం బ్రతికి ఉండాలి కదా అని మోదీ ఉద్ఘాటించారు. ఏప్రిల్ నెలాఖరు వరకు లాక్డౌనే సరైన నిర్ణయమని అన్నారు. కానీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం లాక్డౌన్ పొడిగించడంపై విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సైతం లాక్డౌన్‌ని సడలించాలని కోరుతున్నారు. కాగా, వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగుతుందని, అంతగా ప్రభావితం లేని ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలను కొంత వరకు సడలించే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం.

Tags

Read MoreRead Less
Next Story