బ్రేకింగ్.. తెలంగాణలో ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

బ్రేకింగ్.. తెలంగాణలో ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

తెలంగాణలో కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 30వ తేదీ వరకు పొడగించినట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే ప్రత్యామ్నాయంగా భావించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏప్రిల్‌ 30 తర్వాత లాక్‌డౌన్‌ను దశల వారిగా ఎత్తేవేస్తామని వెల్లడించారు. నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఇక ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story