బుద్దుండక్కర్లా.. నీ ఫోటోలు నువ్వే..
స్టూడియోలో ఫోటోలు దిగి ఇంట్లో పెట్టుకుంటామా ఏంటి.. ఎంచక్కా నెట్లో పెడితే నాలుగు లైకులు, నాలుగు షేర్లు, నాలుగు కామెంట్లు వస్తాయి కదా. అద్గదిగో అలా అలా ఆలోచించడమే పాపమై పోయింది అమెరికన్ స్టార్ కమెడియన్ అమీ షూమర్కి. ఫోటోగ్రాఫర్ ఫెలిప్ రామ్లెస్ చేత తీయించుకున్న ఓ రెండు ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది అమీ. అంతే.. వాటిని సోషల్ మీడియాలో చూసిన రామ్లెస్.. నేను తీసిన ఫోటోలు నా అనుమతి లేకుండా షేర్ చేస్తావా. ఎంత నీ ఫోటోలు అయితే మాత్రం నన్నోమాట అడగక్కర్లా అని అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు.. ఆనక కోర్టుకి కూడా ఎక్కాడు. ఒక్కో ఫోటోకు 1.5 లక్షల డాలర్లు (రూ. 1 కోటిపైగా) నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. అంటే రెండు ఫోటోలకు కలిపి రూ.2 కోట్లు చెల్లించాలన్నమాట. ఈ విధంగా కూడా డబ్బులు సంపాదిస్తారా బాసూ అని ఈ వార్త చూసిన నెటిజన్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. పిచ్చి పీక్స్లో ఉంటే ఇలాంటి పన్లే చేస్తారని మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com