ఢిల్లీలో మరోసారి కంపించిన భూమి
By - TV5 Telugu |13 April 2020 5:46 PM GMT
దేశ రాజధానిలో మరోసారి భూప్రకంపించింది. ఆదివారం సాయంత్రం 5.45 గంటల సమయంలో కంపించిన భూమి.. సోమవారం మరోసారి కంపించింది. రిక్టార్ స్కేల్పై భూ ప్రకంపనలు 2.7గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో రెండోసారి భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భయాందోళనతో ఇళ్లలోంచి బయటకు పరుగు తీశారు. అయితే.. దీని వలన ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని తెలుస్తోంది.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com