చెన్నైలో అమానీయం.. మృతదేహాన్ని స్మశానంలో వదిలేసి వెళ్లారు

చెన్నైలో అమానీయం.. మృతదేహాన్ని స్మశానంలో వదిలేసి వెళ్లారు

చెన్నైలో అమానీయ ఘటన చోటుచేసుకుంది. మృతదేహానికి అంతిమసంస్కారాలు చేయకుండా స్మశానంలో వదిలేసి వెళ్లిన దుర్మార్గం వెలుగుచూసింది. నెల్లూరు కు చెందిన వైద్యుడు కరోనా వైరస్ కారణంగా చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఆయన మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది అంబత్తూరు లోని స్మశాన వాటికకు తీసుకొచ్చి దహనం చెయ్యకుండా అలాగే వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులకు, కార్పొరేషన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలించారు. ఆ ఆసుపత్రి సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు కారణమైన వారిపై ఆరా తీస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story