కరోనాకట్టడికి షారుక్ సాయం.. మహారాష్ట్రకు 25వేల పిపిఇ కిట్లు..
By - TV5 Telugu |14 April 2020 2:41 AM GMT
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ మహారాష్ట్రలో కరోనావైరస్ మహమ్మారిపై పోరాడుతున్న సిబ్బందికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. సోమవారం మహారాష్ట్రలోని ఫ్రంట్లైన్ వైద్య సిబ్బందికి 25 వేల పిపిఇ కిట్లను ఇచ్చారు. దీనిపై మహారాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రాజేష్ తోపే ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. "అభిమాన" నటుడి సహకారం ఆరోగ్య కార్యకర్తలకు ఎంతో సహాయపడుతుందని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దీంతో COVID-19 మహమ్మారిపై పోరాటానికి అందరూ ఐక్యంగా ఉన్నారని మంత్రికి సమాధానమిస్తూ షారుఖ్ రీట్వీట్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com