అమెరికాలో టోర్నాడోల బీభత్సం

X
TV5 Telugu13 April 2020 6:30 PM GMT
అమెరికాలో టోర్నాడోలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆదివారం అమెరికాలోని పలు రాష్ట్రాల్లో టోర్నాడోలు బీభత్సం సృష్టించాయి. ఈ టోర్నాడోలతో సుమారు 8 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మిస్సిసిప్పీలో ఏడుగురు మృతి చెందగా.. అర్కాన్సాలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. టోర్నాడోల ధాటికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సుమారు 39 చోట్ల టోర్నాడోలు మహావిలయం సృష్టించాయి. లూసియానా, టెక్సాస్, మిసిసిప్పీ వంటి రాష్ట్రాల్లో టోర్నాడోలు విరుచుకుపడ్డాయి.
Next Story