హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో షాక్
By - TV5 Telugu |15 April 2020 2:34 PM GMT
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 81, 85 ను హైకోర్టు కొట్టివేసింది. ఏ మీడియం చదువుకోవాలి అనేది పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ణయిస్తారని ప్రముఖ న్యాయవాది ఇంద్రనీల్ జీఓ సవాలు చేస్తూ పిల్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు కొంతకాలం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 81, 85 లను కొట్టివేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com