ఏపీలో 502 కి చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య 500 వందలు దాటాయి. రాష్ట్రంలో మంగళావారం సాయంత్రం 5 నుంచి బుధవారం ఉదయం వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో పశ్చిమ గోదావరి లో 8, కర్నూల్ లో 6, గుంటూరు లో 4, కృష్ణ జిల్లా లో 1 కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 19 కేసుల తో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 502 కి పెరిగింది. అలాగే జిల్లాల వారీగా చూస్తే అనంతపురం 20, చిత్తూరు 23, కర్నూలు 97, కడప 33, ప్రకాశం 42, నెల్లూరు 56, గుంటూరు 118, కృష్ణా 45, పశ్చిమ గోదావరి 31, తూర్పు గోదావరి 17, విశాఖపట్నం 20గా ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story