లాక్ డౌన్ వేళ అక్ర‌మ మ‌ద్యం, సారాయి త‌యారు

లాక్ డౌన్ వేళ అక్ర‌మ మ‌ద్యం, సారాయి త‌యారు

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ అమలవుతున్న వేళ కేరళలో భారీగా మద్యం పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. కేర‌ళ‌లో లాక్‌డౌన్‌ అమలులో ఉన్న వేళ... పలుచోట్ల భారీగా అక్ర‌మ మ‌ద్యం, సారాయి త‌యారు చేస్తున్న‌ట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో డ్రోన్ కెమెరాల సాయంతో పోలీసులు భారీ మొత్తంలో మ‌ద్యాన్ని ప‌ట్టుకున్నారు. వ‌య‌నాడ్ ఎక్సైజ్ స్పెష‌ల్ స్క్వాడ్ బృందం సుల్తాన్ బ‌తెరి ప్రాంతంతోపాటు మ‌రికొన్ని అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు వాడి అక్ర‌మ మ‌ద్యం, సారాయి త‌యారు చేస్తున్న‌ట్లు గుర్తించారు. కేర‌ళ‌ పోలీసులు వివిధ ప్రాంతాల్లో 120 లీట‌ర్లు అక్ర‌మ‌మ‌ద్యం, 111 లీట‌ర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నామ‌ని వ‌య‌నాడ్ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story