ఆంధ్రప్రదేశ్ లో 534 కి చేరిన కరోనా కేసులు

X
By - TV5 Telugu |16 April 2020 6:37 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది.. నిన్న సాయంత్రం 7
గంటల నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో కృష్ణ లో 3, కర్నూల్ లో 3, పశ్చిమ గోదావరి లో 3 కేసు లు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9 కేసుల తో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 534 కి పెరిగింది. అలాగే జిల్లాల వారీగా కేసుల సంఖ్య చూస్తే.. అనంతపురం 21, చిత్తూరు 23, కడప 36, కర్నూలు 113, నెల్లూరు 58, ప్రకాశం 42, గుంటూరు 122, కృష్ణా 48, పశ్చిమ గోదావరి 34, తూర్పు గోదావరి 17, విశాఖపట్నం 20 , మొత్తంగా 534 కేసులు రాష్ట్రంలో నమోదమయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com