ఏపీలో 603 కు చేరిన కరోనా కేసులు

By - TV5 Telugu |18 April 2020 11:12 AM IST
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. తాజాగా మరో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 31 కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. ఈ మేరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 603 కు చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా 42 మంది డిశ్చార్జ్ కాగా మరణాల సంఖ్య 15 గా ఉంది. మరణాలు, డిశ్చార్జ్ లు పోను ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో 546 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా కరోనా కేసులు ఇలా ఉన్నాయి. అంనంతపురం 26, చిత్తూరు 30, కడప 37, కృష్ణ 70, తూర్పు గోదావరి 19, నెల్లూరు 67, ప్రకాశం 44, విశాఖపట్నం 20, గుంటూరు 126, కర్నూల్ 129, పశ్చిమ గోదావరి 35 గా ఉన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com