కరోనా కట్టడిలో భారత్ మెరుగ్గానే ఉంది: లవ్ అగర్వాల్

కరోనా కట్టడిలో భారత్ మెరుగ్గానే ఉంది: లవ్ అగర్వాల్

ఆరోగ్య శాఖ వాక్సిన్ డవలప్‌మెంట్‌పైనే పూర్తి దృష్టి కేంద్రీకరించిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వార్ తెలిపారు. కరోనా కేసుల్లో 80 శాతం మంది కోలుకుంటున్నారని.. మిగతా 20 శాతం మరణాలు చేటుచేసుకుంటున్నాయన ఆయన తెలిపారు. ప్రతి ఆరు రోజులకు ఒకసారి కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నాయని, అయితే కరోనా కట్టడిలో భారత్ మెరుగ్గానే ఉందని చెప్పారు.

ఇప్పటి వరకూ దేశంలో 13,387 కరోనా కేసులు నమోదయ్యాయని.. 1,079 మంది డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. 13.05 శాతం కోలుకుంటున్నారని అన్నారు. కరోనా పేషెంట్ల కోసం దేశవ్యాప్తంగా 1,919 ఆసుపత్రులు ఉండగా, 1,73,000 పైగా ఐసొలేషన్ బెడ్లు, ఐసీయూలో 21,000 బెడ్లు అందుబాటులో ఉన్నట్టు వివరించారు.

మే నాటికి 10 లక్షల ఆర్‌టీపీసీఆర్ కిట్లు రెడీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కరోనా తీవ్రాత ఎక్కువగా ఉన్న రాష్టాలు, జిల్లాలకు 5 లక్షల రాపిడ్ యాంటీ బాడీ టెస్టి కిట్లు పంపినట్టు ఆయన తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story