జపాన్లో భారీ భూకంపం
By - TV5 Telugu |18 April 2020 5:09 PM GMT
జపాన్లో భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ తీరం ఒగాసవరా దీవుల్లో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. 490 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించిందని జపాన్ అధికారులు తెలిపారు. ప్రపంచంలో 6.0 లేదా అంతకు మించి వచ్చే భూ ప్రకంపనల్లో 20 శాతం జపాన్లోనే సంభవిస్తాయి. శనివారం సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com