విచారణకు సహకరిస్తా: తబ్లిగి జమాత్ చీఫ్

విచారణకు సహకరిస్తా: తబ్లిగి జమాత్ చీఫ్

భారత్‌లో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందడానికి కారణం తబ్లిగీ జమాత్. గత మార్చి నెలలో దేశ రాజధాని ఢిల్లీ మర్కజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. ఈ వేదికకు రూపకర్త తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కంధల్వి ఢిల్లీ క్రైం బ్రాంచ్‌కి లేఖ రాశారు. నేను మీ దర్యాప్తుకు సహకరిస్తాను అని ఏప్రిల్ 16 (గురువారం) నగర పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఏప్రిల్ 8 వరకు స్వీయ నిర్భంధంలో ఉన్న మౌలానా సాద్, మర్కజ్ సమావేశాలకు పురిగొల్పాడని, కరోనా వైరస్ గురించిన సమాచారం ఉన్నప్పటికీ సంబంధిత హెచ్చరికలను ఖాతరు చేయలేదని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సాద్ ఐసోలేషన్ కాలం ముగిసినందున దర్యాప్తుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తరపు న్యాయవాది చెబుతున్నారు.

80కి పైగా దేశాల అనుచరులను సమాయత్తం చేసే తబ్లిగి ప్రపంచంలోని అతిపెద్ద సున్నీ ముస్లిం సంస్థలలో ఒకటి. ఈ కార్యక్రమంలో దాదాపు 9,000 మంది పాల్గొన్నట్లు అంచనా. సమావేశాలకు హాజరైన వారంతా భారత దేశంతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన వారే. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన వెయ్యి కరోనా కేసుల్లో ఈ తబ్లిగీ జమాత్‌కు సంబంధం ఉన్నవారే అని ప్రభుత్వం అంచనా వేసింది. వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి.

మొత్తం 25,000 కేసులు లెక్క తేలడంతో వారందరిని విచారించడంతో పాటు, కరోనా టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ అని తేలిన వారికి వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. కాగా, ''కొన్ని వర్గాలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయని కోవిడ్ వ్యాప్తికి తబ్లిగి జమాత్ కారణమని అంటున్నాయి. మతపరమైన రంగును పులుముతున్నాయి''. వీటన్నింటినీ ఆపాలని కోరుతూ ముస్లిం సంస్థ జమియత్ ఉలేమా-ఇ-హింద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే మోసానికి దారితీసే ఏ ఉత్తర్వులను ఆమోదించబోమని కోర్టు సోమవారం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story