బ్రిటన్ రాణి మనవరాలు పెళ్లి మరోసారి వాయిదా!
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా స్వైర విహారం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 21 లక్షల 92 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షా 47 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాని నివారించడానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తోంది. దీంతో ప్రజలు, సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేఫథ్యంలో అన్ని రకాల శుభకార్యలు వాయిదా వేసుకుంటున్నారు . తాజాగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ మనవరాలు పెళ్లి కూడా వాయిదా పడినట్లు సమాచారం. ఇదివరకే ఒకసారి వాయిదా పడిన యువరాణి బియట్రైస్-ఎడోయార్డో మాపెల్లి మొజ్జి పెళ్లి మరోసారి కూడా వాయిదా వేశారని తెలుస్తోంది. గత మార్చిలో వీళ్ల వివాహం జరగాల్సి ఉండగా.. అప్పట్లో కరోనా వైరస్ ఉనికిలోకి రావడంతో పెళ్లిని మే నెలకి వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో. వచ్చేనెలలో ప్రతిష్టాత్మక బంకింగ్హ్యామ్ పాలెస్లో జరగాల్సిన పెళ్లిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లి గురించి మాత్రం రాచకుటుంబ వర్గాలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా బ్రిటన్లో లక్షకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు అక్కడ 13 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com