ఉద్యోగులను తొలగించవద్దు : కేటీఆర్
By - TV5 Telugu |18 April 2020 7:26 PM GMT
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించవద్దని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఒక్క ఉద్యోగి కూడా ఉపాధి కోల్పోకుండా చోరువ తీసుకోవాలని తెలిపారు. మీ ఉద్యోగుల పట్ల సానుభూతి చూపాలన్నారు. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ కంపెనీల అధినేతలకు కేటీఆర్ లేఖ రాశారు. లాక్డౌన్ తర్వాత సిబ్బందిని తొలగించవద్దని లేఖలో మంత్రి కోరారు. ఉద్యోగాలు తీసివేయకుండా ఖర్చులు తగ్గించుకోవాలని కంపెనీలకు సూచించారు. లాక్డౌన్ తరువాత త్వరలోనే పరిశ్రమలు పుంజుకుంటాయని పేర్కొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com