coronavirus : ఇరాన్ను అధిగమించిన టర్కీ

X
By - TV5 Telugu |19 April 2020 2:04 PM IST
మధ్య ఆసియాలో కరోనా సోకిన దేశాల్లో టర్కీ.. ఇరాన్ను అధిగమించింది. ప్రస్తుతం ఇక్కడ 82 వేల 329 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇరాన్ లో 80 వేల పాజిటివ్ కేసులు ఉన్నాయి. టర్కీలో గత 24 గంటల్లో దేశంలో 3 వేల 783 కొత్త కేసులు నమోదు కాగా, 121 మంది మరణించారు. మరోవైపు దేశంలో ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 1890 మంది మరణించారు అని ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా శనివారం చెప్పారు.
కరోనావైరస్ నుండి ఇప్పటివరకు మొత్తం 10,453 మంది కోలుకున్నారని, గత 24 గంటల్లో 40,520 మందికి పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. శనివారం అర్ధరాత్రి నుంచి మరో 15 రోజులు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్టు అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com