చైనా, దక్షిణ కొరియాలో 25 కొత్త కేసులు నమోదు

X
By - TV5 Telugu |20 April 2020 6:26 PM IST
చైనాలో కొత్తగా 12 కేసులు నమోదయ్యాయని చైనా ఆరోగ్య అధికారులు సోమవారం తెలిపారు. దేశీయ సంబంధాల వల్ల నాలుగు కేసులు వచ్చాయని జాతీయ ఆరోగ్య కమిషన్ నివేదించింది. వాటిలో మూడు హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్ నుండి , ఒకటి మంగోలియా అటానమస్ రీజియన్ నుండి వచ్చాయి. మరో ఎనిమిది కేసులు బయటి నుండి వచ్చాయి. చైనాలో ఆదివారం మరణాలు ఏవి సంభవించలేదు. మరోవైపు దక్షిణ కొరియాలో 24 గంటల్లో 13 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు 10 వేల 674 సంక్రమణ కేసులు నమోదయ్యాయి, మొత్తం 236 మంది మరణించారు. కొత్త కేసులు వరుసగా మూడవ రోజు 20 కన్నా తక్కువ. ఆదివారం 8 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com