అమెరికాలో 24 గంటల్లో 1,997 మంది మృతి

అమెరికాలో కరోనా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 1,997 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 41 వేలు దాటింది. దేశంలో ఇప్పటివరకు 41.8 లక్షల మంది పౌరులను పరీక్షించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం చెప్పారు. ఈ సంఖ్య అన్ని దేశాల కంటే ఎక్కువని చెప్పారు. ఇప్పటివరకు అమెరికాలో ఏడు లక్షలకు పైగా 64 వేల మందికి పైగా ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. 71,012 మంది కోలుకున్నారు.

యుఎస్ కేసులలో ఎక్కువ భాగం న్యూయార్క్ నగరంలో నమోదయ్యాయి. మార్చి 20 నుండి, న్యూయార్క్ , కనెక్టికట్, న్యూజెర్సీ రాష్ట్రాలలో మొత్తం US కేసులలో 50% నమోదయ్యాయి. ఏప్రిల్ 9 నాటికి, COVID-19 నుండి మరణించిన వారిలో దాదాపు 60% ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉన్నారు. ప్రస్తుతం న్యూయార్క్ లో మాత్రమే ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story