బీఎండబ్ల్యూ ఇండియా సీఈవో కన్నుమూత

బీఎండబ్ల్యూ ఇండియా సీఈవో కన్నుమూత

బీఎండబ్ల్యూ ఇండియా సీఈవో రుద్రతేజ్ సింగ్ కన్నుమూశారు. అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సోమవారం ఉదయం మృతి చెందారు. ఆయన హఠాత్పరిణామంపై బీఎండబ్ల్యూ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ సంస్థ ఇండియా సీఈవోగా.. 2019 ఆగస్టు1న రుద్రతేజ్ సింగ్ నియమితులయ్యారు. 1996లో యూపీలో చిన్న ఏరియా సేల్స్ మేనేజర్‌గా జీవితం ప్రారంభించిన రుద్ర తేజ్ సింగ్ క్రమంగా ఎదుగుతూ విజయ పథాన్ని నిర్మించుకున్నారు. రుద్రతేజ్ సింగ్ ఆకస్మిక మరణం పట్ల వ్యాపార ప్రముఖులుల సంతాపం ప్రకటిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story