ఏపీలో ఒక్కరోజే కరోనాతో ముగ్గురు మృతి

ఏపీలో ఒక్కరోజే  కరోనాతో ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే కొత్తగా 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 722కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 610 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 92 మంది కోలుకున్నారు. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక సోమవారం ఒక్కరోజే కరోనాతో ముగ్గురు మృతిచెందారు.

Tags

Read MoreRead Less
Next Story