మధ్యప్రదేశ్ లో ఐదుగురితో మంత్రివర్గం ఏర్పాటు?

మధ్యప్రదేశ్ లో ఐదుగురితో మంత్రివర్గం ఏర్పాటు?

నేడు మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గం ఏర్పాటు కానుంది. బీజేపీ నుండి ముగ్గురు మంత్రులు, జ్యోతిరాదిత్య సింధియా వర్గం నుండి ఇద్దరు.. మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నరోత్తం మిశ్రా, మీనా సింగ్, కమల్ పటేల్ .. సింధియా వర్గానికి చెందిన తులసి సిలావత్, గోవింద్ సింగ్ రాజ్‌పుత్‌లను మంత్రులుగా ఎంపికయ్యారు.

మొదట గోపాల్ భార్గవ, భూపేంద్ర సింగ్ , బిసాహులాల్ సింగ్ పేర్లు కూడా వినిపించాయి.. కాని చిన్న మంత్రివర్గం కారణంగా వీరిని పరిగణలోకి తీసుకోలేదు. బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా నుండి అనుమతి పొందిన తరువాతే క్యాబినెట్ కూర్పుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా ఉన్న సిలావత్ బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story