ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు
By - TV5 Telugu |22 April 2020 2:26 PM GMT
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. తాజాగా మరో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో చిత్తూరులో 6, గుంటూరులో 19, కడపలో 5, క్రిష్ణాలో 3, కర్నూలులో 19, ప్రకాశంలో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 813కు చేరింది. వీరిలో 120 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 24 మంది కోవిడ్ కు బలయ్యారు. ప్రస్తుతం 669 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ను విడుదల చేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com