ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. తాజాగా మరో 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో చిత్తూరులో 6, గుంటూరులో 19, కడపలో 5, క్రిష్ణాలో 3, కర్నూలులో 19, ప్రకాశంలో 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 813కు చేరింది. వీరిలో 120 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, 24 మంది కోవిడ్ కు బలయ్యారు. ప్రస్తుతం 669 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్‌ను విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story