కరోనా సోకిన మహిళ.. పండంటి పాపాయికి జన్మనిచ్చింది

కరోనా సోకిన మహిళ.. పండంటి పాపాయికి జన్మనిచ్చింది

దేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు , మరణాల మధ్య, ముంబైలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముంబైలోని నానావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 35 ఏళ్ల కరోనావైరస్ పాజిటివ్ మహిళ.. అంటువ్యాధి లేని, ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ మధ్య ఎటువంటి సంబంధం లేకుండా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తల్లికి సోకిన వైరస్ బిడ్డకు తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల మహిళ ప్రసూతి కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు..

ఆమెకు లక్షణాలు లేనప్పటికీ, ప్రోటోకాల్ ప్రకారం, ప్రసవానికి ముందు పరీక్షలు చేశారు.. దురదృష్టవశాత్తు, ఏప్రిల్ 18 న ఆ మహిళకు పాజిటివ్ అని తేలింది. అయితే కోవిడ్ -19 పాజిటివ్ రోగులకు ప్రసూతి విభాగం ఆ ఆసుపత్రిలో లేనందున, మహిళను నానావతి ఆసుపత్రికి తరలించారు. తాజాగా ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు స్థిరంగా , పూర్తిగా ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.

కాగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలిన 25 ఏళ్ల మహిళ కూడా సోమవారం పూణేలోని సాసూన్ ఆసుపత్రిలో అంటువ్యాధి లేని, ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఏప్రిల్ 16 న ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story