పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కరోనా పరీక్షలు

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కరోనా పరీక్షలు

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఈ కరోనాపై పోరాటంలో భాగంగా సామాన్యులు నుంచి సెలబ్రెటీల వరకు ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎది ఫౌండేషన్‌ చైర్మన్‌ ఫైజస్‌ ఎది ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసి విరాళాన్ని అందజేశారు. అనంతరం ఫైజల్‌లో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అతనికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ఫైజల్‌ కరోనా బారిన పడటంతో అప్రమత్తమైన షౌకత్‌ ఖానం మెమోరియల్‌ హాస్పిటల్ డాక్టర్లు.. ప్రధాని ఇమ్రాన్‌ను పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు.

ఇందుకు ఇమ్రాన్ అంగీకరించడంతో వైద్యులు కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని ఇమ్రాన్ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story