కరోనా షాక్ నుంచి కోలుకుంటున్న ఇటలీ

కరోనా షాక్ నుంచి కోలుకుంటున్న ఇటలీ

కరోనా షాక్ నుంచి ఇటలీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మరణాల సంఖ్య గతం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఇటలీలో గత 24 గంటల్లో 437 మంది మరణించారు , ఒక రోజు క్రితం 534 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో మరణించిన వారి సంఖ్య 25 వేలు దాటింది. చైనా నుంచి వ్యాపించిన కరోనా ఇటలీలో తీవ్ర ఆందోళన సృష్టించింది.

నాలుగు వారల కిందట వరకూ మరణాలు రోజు 7 వందలకు పైగా నమోదవుతున్నాయి. అయితే అవి క్రమంగా తగ్గుతున్నాయి. మార్చ్ 28 నుంచి మరణాల రేటు తగ్గుతూ వస్తోంది. ఇక ఇటలీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 187,327 ఉండగా ఇందులో 54,543 మంది కోలుకొని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story