వలస కూలీలను స్వస్థలాలకు చేరవేయాలి: మాయావతి
By - TV5 Telugu |22 April 2020 8:08 PM GMT
కొత్త విద్యార్థులను ఎలా అయితే ప్రత్యేక బస్సుల్లో స్వరాష్ట్రానికి రప్పించారో.. వలస కూలీలను కూడా అదే విధంగా రప్పించాలని బీఎస్పీ అధినేత మాయావతి కేంద్రాన్ని కోరారు. లాక్డౌన్ కారణంగా మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కి చెందిన చాలామంది వలస కూలీలు ఎక్కువగా చిక్కుకుపోయారని.. ఉపాధి కోల్పోవడంతో ఆకలి వారిని తీవ్రంగా బాధిస్తోందని అన్నారు. ఒకపూట కూడా వారికి సరైన భోజనం లభించడం లేదని.. వారు వారి స్వస్థలాలకు వస్తే.. పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుందని అన్నారు. కేంద్రం వారి డిమాండ్లను పరిశీలించి.. ప్రత్యేక రైళ్లు, బస్సులు వేయాలని మాయావతి కోరారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com