కరోనా: కేరళలో నాలుగు నెలల చిన్నారి మృతి

కోవిడ్ -19 కారణంగా నాలుగు నెలల శిశువు మరణించింది. ఈ ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లాలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గుండె సమస్యలతో జన్మించిన శిశువును ఏప్రిల్ 22 న ఆసుపత్రిలో చేర్పించారు తల్లిదండ్రులు. చికిత్స చేస్తున్న సమయంలో పాపకు కోవిడ్ -19 పరీక్షలు చేశారు.. ఈ క్రమంలో పాపకు పాజిటివ్ అని తేలింది. కాగా చికిత్స పొందుతున్న చిన్నారి దురదృష్టవశాత్తు శుక్రవారం ఉదయం మరణించింది. చిన్నారి తల్లిదండ్రులు మలప్పురం జిల్లాలోని పాయనద్ గ్రామానికి చెందినవారు. మరోవైపు కేరళలో గురువారం కొత్తగా కేవలం 10 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 447 ఉండగా ఆక్టివ్‌ కేసుల సంఖ్య 129 గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story