సోమవారం నుంచి డ్యూటీలోకి యూకే ప్రధాని
By - TV5 Telugu |24 April 2020 3:40 PM GMT
యుకె ప్రధాని బోరిస్ జాన్సన్ గత నెలలో కరోనావైరస్ కు గురైన సంగతి తెలిసిందే.. ఈ నెల ఆయన మొదటివారంలో కోలుకున్నారు. లండన్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన బోరిస్ జాన్సన్.. కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న యుద్ధానికి బాధ్యత వహించడానికి సిద్ధమయ్యారు. సోమవారం నుంచి తిరిగి డ్యూటీలోకి రావాలని యోచిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
కాగా ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుండి, జాన్సన్ బ్రిటిష్ ప్రధాని అధికారిక గృహమైన చెకర్స్ వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రధాని చికిత్స పొందుతున్న సమయంలో విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ ప్రభుత్వ సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com