రాజస్థాన్ కోటలో చిక్కుకున్న విద్యార్థుల కోసం 31 బస్సులు పంపిన హర్యానా ప్రభుత్వం
By - TV5 Telugu |23 April 2020 7:20 PM GMT
రాజస్థాన్ కోటలో చిక్కుకున్న తమ విద్యార్ధులను తీసుకొచ్చేందుకు హర్యానా ప్రభుత్వం చేపట్టింది. మొత్తం 800 మంది విద్యార్థుల కోసం 31 ప్రత్యేక బస్సులను పంపించింది. పోటీ పరీక్షల కోసం కోచింగ్ కు వెళ్లి.. లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుపోయారు. వారి కోసం హర్యానా రోడ్వేస్కి చెందిన 31 బస్సులు రేవారీ, నార్నౌల్ డిపోల నుంచి వెళ్లాయని ప్రభుత్వం ప్రకటించింది.
కాగా.. గత వారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ విద్యార్థులను ప్రత్యేక బస్సుల ద్వారా స్వరాష్ట్రానికి తీసుకొని వచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com