coronavirus : అత్యంత ప్రభావవంతమైన ఖండంగా యూరప్

X
By - TV5 Telugu |25 April 2020 7:17 AM IST
కరోనావైరస్ మహమ్మారి నుండి ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య శుక్రవారం 1,90,000 దాటింది, ఐరోపాలో దాదాపు మూడింట రెండు వంతుల మరణాలు సంభవించాయి. డిసెంబరులో చైనాలో వైరస్ వెలువడినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 26,98,733 మందికి సోకింది. ఇందులో 1,90,089 మంది మరణించారు. 1,16,221 మరణాలు, 1,296,248 కేసులతో యూరప్ అత్యంత ప్రభావవంతమైన ఖండంగా మారింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు కలిగిన దేశం యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ 49,963 మంది చనిపోయారు. ఆ తరువాత ఇటలీ 25,549, స్పెయిన్ 22,157, ఫ్రాన్స్ 21,856, బ్రిటన్ 18,738 మంది వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com