162 మంది జ‌ర్న‌లిస్టుల‌కు కరోనా పరీక్షలు

162 మంది జ‌ర్న‌లిస్టుల‌కు కరోనా పరీక్షలు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరిని వదలటం లేదు. కరోనా మహమ్మారి అంద‌రిపై త‌న ప్ర‌తాపం చూపిస్తోంది. కరోనాని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వ‌హిస్తున్న‌ డాక్ట‌ర్లు, ఆస్ప‌త్రి సిబ్బంది, పోలీసులు, మీడియా ప్ర‌తినిధులు, పారిశుద్ధ్య కార్మికుల‌పైనా కూడా క‌రోనా పంజా విసురుతోంది. ఇక ఈ మహమ్మారి ఢిల్లీలో అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీలో దాదాపు 160 మంది జ‌ర్న‌లిస్టుల‌ను క‌రోనా అనుమానంతో క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో తాజాగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా క‌రోనా నెగిటివ్ గా తేలింది. దీంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story